మన్యం టీవీ గుండాల: కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చి మెరుగైన వైద్యం అందించాలని న్యూ డెమోక్రసీ నాయకులు గుండాల ఎంపీపీ ముక్తి సత్యం అన్నారు శుక్రవారం గుండాల తాసిల్దార్ ఆర్ రమేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందక ప్రవేట్ ఆస్పత్రికి వెళితే లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయని సామాన్యులు పెద్ద మొత్తంలో డబ్బులు కట్టలేక పోతున్నారన్నారు ఆరోగ్య శ్రీ లో చేర్చి ప్రైవేట్ ఆస్పత్రిలో కూడా వైద్యం అందేలా చూడాలన్నారు మండలంలో చాలా గ్రామాల్లో కరోనా ఉధృతంగా ఉన్నందున ఇంటింటికి తిరుగుతూ పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందించాలన్నారు స్థానిక వైద్యశాలకు అదనపు వైద్యుడిని కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలో గుండాల సర్పంచ్ సీతారాములు పీ వై ఎల్ జిల్లా కార్యదర్శి రవి లాలయ్య అజ్గర్ మల్లయ్య జార్జ్ తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: