మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం నరసింహసాగర్, బ్రాహ్మణ పల్లి గ్రామ పంచాయతీ లలో కోవిడ్ ఫీవర్ సర్వే నిర్వహించారు.యుద్ధప్రాతిపదికన మండలం లోని అన్ని గ్రామాలలో కోవిడ్ ఫీవర్ సర్వే నిర్వహిస్తున్న సందర్బంగా నరసింహసాగర్ గ్రామపంచాయతీ, బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీ లలో ఇంటి ఇంటికి కోవిడ్ ఫీవర్ సర్వే నిర్వహిస్తు ప్రజలను కోవిడ్ పట్ల అప్రమత్తం చేసి ప్రజల్లో అవగాహనా తీసుకొనివచ్చారు.ఎటువంటి జ్వరం కానీ కోవిడ్ లక్షణాలు ఉంటే టెస్టులకు చేయించుకోవలసినదిగా సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపిఓ శ్రీకాంత్, ఏ ఎన్ ఎంలు,ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
Post A Comment: