లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: మణుగూరు ఏ ఎస్పీ డాక్టర్ శబరీష్
మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలలో ఏఎస్పి శబరీష్ ఐపిఎస్ లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలందరూ లాక్ డౌన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని,పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా సంచరిస్తువారిని హెచ్చరిస్తూ,ప్రభుత్వ నిబంధనలు పాటించాలని ఆదేశించిన మణుగూరు ఏఎస్పి శబరీష్ ఐపిఎస్,సీఐ భాను ప్రకాష్,ఎస్సైలు నరేష్, బట్ట.పురుషోత్తం ఆధ్వర్యంలో పెట్రోలింగ్ చేస్తూ వాహనాల తనిఖీ చేపడుతున్నారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడటం కోసం ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది అన్నారు.ప్రజల అవసరాల కోసం ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు సడలింపు ఇచ్చింది.కానీ కొందరు వ్యక్తులు ఎలాంటి అవసరం లేకుండా బయట తిరుగుతున్న వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఉద్యోగాలకు వెళ్లే వారు వారి వెంట వారి యొక్క గుర్తింపు తప్పనిసరిగా తీసుకెళ్లాలని సూచించారు.కరోనా మహమ్మారి అరికట్టడానికి ప్రతిఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ, మాస్కు ధరించాలని,భౌతిక దూరం పాటించాలి అన్నారు.నిబంధనలు పాటిస్తూ,ఇంట్లోనే ఉండాలి అని అత్యవసర పరిస్థితుల్లో నే బయటకు రావాలని ప్రజలకు సూచించారు.
Post A Comment: