రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో బాధితులకు ఉచితంగా నిత్యావసర వస్తువుల పంపిణీ
మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లో కరోనా బారిన పడి ఇబ్బందులు పడుతున్న కరోనా బాధిత కుటుంబాలకు రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో,తెలంగాణ ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు ఉచితంగా వారం రోజులకు సరిపడా నిత్యవసర సరుకుల కిట్ లను శుక్రవారం మణుగూరు మండల ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు బాధితులకు వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో నియోజకవర్గ మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,వార్డు మెంబర్ నర్సింహారావు,టిఆర్ఎస్ నాయకులు ముద్దంగుల కృష్ణ,యువజన నాయకులు, తదితరలు పాల్గొన్నారు.
Post A Comment: