మన్యం టీవీ మణుగూరు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు మండలం గుట్ట మల్లారం పంచాయితీ,పరిధిలో ని రథం గుట్ట దగ్గర అర్భన్ పార్క్ ఏర్పాటుకు సుమారు 275 ఎకరాలలో,2 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన పనులను సోమవారం కాలినడకన స్వయంగా తెలంగాణ ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు,ఫారెస్ట్ అధికారులు,తహశీల్దార్ చంద్రశేఖర్ తో కలిసి పరిశీలించడం జరిగింది.అర్బన్ పార్కులో ఉన్న మూడు కొలనులు,మరియు 12 సోలార్ లైట్లు,కిలోమీటర్ వాకింగ్ ట్రాక్,వెన్నల జలపాతం లను సందర్శించి పనులు వేగవంతం చేయాలి అని ఆదేశించారు.ఈ కార్యక్రమం లో మణుగూరు జెడ్పీటీసీ పొశం.నరసింహరావు, తహసీల్దార్ చంద్రశేఖర్,ఎంపీడీఓ పి.వెంకటేశ్వర్లు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు,ఎంపీటీసీ కణితి బాబురావు,కో ఆఫ్సన్ జావేద్ పాషా,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,టిఆర్ఎస్ నాయకులు ఎడ్ల శ్రీను,హరి బాబు,వేముల లక్ష్మయ్య, ముద్దంగుల కృష్ణ,నైనారపు నగేష్,సోషల్ మీడియా ఇన్చార్జి సిరికొండ శ్యామ్ సుందర్ రావు,రెవెన్యూ అధికారులు,ఫారెస్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: