CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా వ్యాధి తో ఆర్ఎంపీ డాక్టర్ మృతి.

Share it:


 మన్యం  టీవీ వాజేడు.           గ్రామీణ వైద్యులు పాండురంగ రాజు మృతికి పలువురు సంతాపం   ములుగు జిల్లా వాజేడు మండలం లో గ్రామీణ వైద్యులుగా , పేదలకు రేయింబవళ్ళు, అత్యవసర సమయాల్లో స్వయంగా ఇళ్లకు వెళ్లి, వైద్య సహాయం అందించి, ఎంతోమందికిఆయన ప్రాణదానం చేశారు.అర్.ఎం.పి. రాజు గారు గా పేరుగాంచిన,శ్రీ పాండు రంగ రాజు మృతి పట్ల పలువురు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుండి వైద్యం కోసం వచ్చే పేదల వద్దనుండి ఎటువంటి ఫీజులు తీసుకోకుండా, ప్రథమ చికిత్సలు నిర్వహించి, వైద్యం అందించి, అవసరమైనవారికి, ఆర్థిక సహాయంతో మెరుగైన వైద్యం కోసం  పట్టణాలకు సైతం సొంత ఖర్చులతో పంపించి ఎంతోమందిని ఆదుకున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లోరాజుగారు మంచి పేరు ప్రతిష్టలు పొందారు.

  ఆయన మృతి పట్ల అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు, సంఘాలు, వెంకటాపురం వాజేడు మండలాల గ్రామీణ వైద్యుల సంఘం ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: