హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్లో సీఎస్ సోమేశ్కుమార్, వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. కరోనా కట్టడి చర్యలు, ఔషధాలు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై కేసీఆర్ వారితో చర్చిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఫీవర్ సర్వే వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రుల్లో ఔషధాలు, ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో టీకాల కొరతను అధిగమించేందుకు ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఈ సమీక్షలో చర్చిస్తున్నారు.
Post A Comment: