రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు ద్వారా 1500 మంది బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ
మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గం లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో, కరోనా బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న దాదాపు 1500 మందికి రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బియ్యం,నిత్యావసర సరుకులు,కూరగాయలు ఉచితంగా అందించాలని ట్రస్ట్ చైర్మన్,తెలంగాణ ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.ది.2.5.2021 ఆదివారం నుండి నియోజకవర్గం లోని ఏడు మండలాల అధ్యక్షుల నేతృత్వంలో కరోనా బాధితులకు ఈ సహాయాన్ని అందించనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సోకిన వ్యక్తి నిత్యావసరాల కోసం బయటికి రావడం వలన వారి నుండి ఇంకొకరికి సోకడం జరుగుతుందనే సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విప్ రేగా తెలిపారు.ఇలా సహాయం అందించడం వలన కరోనా సోకిన వ్యక్తి నిత్యావసర సరుకుల కొరకు బయటికి రాకుండా ఉంటారని,తద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చని ఆయన తెలిపారు.కరోనా బాధితులు ఎవరు అధైర్య పడొద్దని,తాను ఉన్నానని వారంతా ధైర్యంగా ఉండాలని ప్రజలంతా తప్పనిసరిగా మాకు ధరిస్తూ ఎప్పటికప్పుడు చేతులను శానిటైజేషన్ చేసుకోవాలని విప్ రేగా కాంతారావు నియోజకవర్గ ప్రజలకు సూచించారు.
Post A Comment: