CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నాడు మాజీ ఎంపీపీ బాలు నాయక్ నేడు తల్లి( గంగ్లీ ) కరోనాతో మృతి.

Share it:

 


•గ్రామంలో తీవ్ర విషాదం.


చండ్రుగొండ మన్యం టీవీ  ప్రతినిధి.

 

మహమ్మారి కరోనా వైరస్ ప్రజల ప్రాణాలను క్షణాల్లో హరింప జేస్తుంది. తాజాగా మండలంలో ఇటీవలే కరోనా చికిత్స పొందుతూ మాజీ ఎంపీపీ గుగులోత్ బాలు నాయక్ మృతి చెందారు. ఇది జరిగి కనీసం పది రోజులు కాకముందే  ఆ కుటుంబంలో మరో విషాదం నెలకొంది. బాలు నాయక్ మాతృమూర్తి గుగులోత్ గంగ్లీ (70) ఖమ్మం లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబంలో తల్లి కొడుకు మరణించడంతో చివరకు బంధువులకు సైతం చివరి చూపు దక్కపోవడంతో.. ఆ కుటుంబ సభ్యులను ఓదార్చి దైర్యం చెప్పేవారు లేకపోవడంతో  తీవ్ర దిగ్భ్రాంతి లోకి వెళ్ళిపోయారు. గుగులోత్ గంగ్లీ మరణవార్త తెలుసుకున్న. గుంపెన సొసైటీ మాజీ వైస్ చైర్మన్ మేడా మోహన్ రావు. ఫోను ద్వారా వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం వారికి మనో ధైర్యం చెప్పారు. మీ కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లామని  మీ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటారని వారు హామీ ఇచ్చారని తెలిపారు. ఫోన్ ద్వారా పరామర్శించిన వారిలో టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు ఉప్పతల ఏడుకొండలు, బాబురావు, గాదె శివప్రసాద్, సూరా వెంకటేశ్వర్లు, తదితరులు ఫోన్ ద్వారా నివాళులర్పించారు.

Share it:

TELANGANA

Post A Comment: