• ఎంపీడీవో డి అన్నపూర్ణ.
చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి.
గ్రామ స్థాయిలో ఉండే అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎంపీడీవో డి అన్నపూర్ణ సూచించారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో. పంచాయతీ కార్యదర్శుల తో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ... మహమ్మారి కరోనా వైరస్ మండల వ్యాప్తంగా ఉధృతంగా ఉన్న దృశ్య. గ్రామస్థాయి అధికారులు అందరూ తమ వ్యక్తిగత సంరక్షణ పాటిస్తూ.. గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని. ముఖ్యంగా నేటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో వేసవిని దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లో మంచినీటి సమస్య ఎక్కడ తలెత్తకుండా చూడాలని. గ్రామాల్లో ఎప్పటికప్పుడు శానిటేషన్ నిర్వహించాలని. ప్రజల్లో కరోనా భయాన్ని పోగొట్టి. గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ.. సిబ్బంది తమ వ్యక్తిగత భద్రతను పాటిస్తూ. తమ విధులను నిర్వహించాలని. సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో ప్రమీల, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Post A Comment: