CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినా వారి పై కఠినమైన చర్యలు తప్పవు.

Share it:

 

కరకగూడెం సబ్ ఇన్స్పెక్టర్ గడ్డం ప్రవీణ్ కుమార్

మన్యం టీవీ కరకగూడెం:ఉదయం 10 గంటల తరువాత ఎవ్వరూ అయిన అనుమతి లేకుండా రోడ్డు మీడకి వచ్చి లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని కరకగూడెం సబ్ ఇన్స్పెక్టర్ గడ్డం ప్రవీణ్ కుమార్ తెలిపారు.లాక్ డౌన్ కఠినంగా అమలు చేయుటలో భాగంగా కూరగాయల దుకాణాలు, కిరణా మరియూ ఇతర షాపుల యజమానులు తమ తమ షాపుల వద్ద సామజిక దూరం పాటించే విదంగా తమ షాపుల ముందు ముగ్గులతో రింగులు మార్క్ చెయాలని తెలిపారు.ఉదయం 10 గంటల తరువాత పాసులు లేకుండా ఎవ్వరైనా వాహన దారులు అనవసరంగా రోడ్ల మీదకి వచ్చినట్లయితే వారి యొక్క వాహనాలు సిజ్ చెసి కేసులు నమోదు చేయ్యబడతాయన్నారు. అలాగే సింగరేణి, బిటిపియస్,అర్ టిసి వారు తమ ఐడెంటిఫికేషన్ కార్డులు వెంట


ఉంచుకోవాలన్నారు.మందుల కోసం వెళ్లేవారు విధంగా డాక్టర్ చీటి వేంట ఉంచుకోవాలని ,బ్యాంకు లావాదేవీలు వెళ్ళే వారు ఉదయం 10 గంటల లోపు వారి పనులు ముగించుకుని ఇండ్లకు వెళ్లిపోవాలన్నారు.ఎవ్వరైనా ఉదయం 10 గంటల తరువాత రోడ్ల మీదకు అనుమతించబడదని అయన తెలిపారు. లాక్ డౌన్ నిబంధనలు ఎవ్వరైనా ఉల్లంఘించినా వారిపై కఠిన చర్యలు తిసుకుంటమన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: