మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:-మండలంలోని కట్టుగూడెం గ్రామానికి చెందిన రైతు, బేతిని నాగేశ్వరరావు (45 సంవత్సరాలు ) పాము కాటుకు మరణించారు. గత బుధవారం (12-05-2021) రోజున, అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మలవిసర్జనకు బయటకు వచ్చిన నాగేశ్వరావును, పాము కాటు వేయడం జరిగింది. హుటాహుటిన కుటుంబ సభ్యుల సహకారంతో ఎర్రగుంట ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంకు తీసుకువెళ్లగా , ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నాగేశ్వరరావు పరిస్థితి విషమించడంతో ఖమ్మం ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి, చికిత్స పొందుతూ, తెల్లవారుజామున మృతిచెందారు. రైతు బేతిన నాగేశ్వరరావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ పెద్ద మరణంతో, వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Post A Comment: