మన్యం టీవీ ఏటూరు నాగారం:
ఏటూరు నాగారం మండలంలోని కోయగూడా ఎల్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గురువారం ఓడి సీఎంఎస్ ద్వారా మంజూరైన టు వంటి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ములుగు భూపాలపల్లి జిల్లాలో రైతుబంధు సమితి అధ్యక్షులు పల్ల బుచ్చయ్య ప్రారంభించారు.అనంతరం
పల్ల బుచ్చయ్య మాట్లాడుతూ కరోనా మహమ్మారి ప్రాణాలను హరిస్తున్న రైతులు బాగుండాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. రైతులకు నష్టం జరగ వద్దు అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు ములుగు జిల్లా పరిషత్ చైర్పర్సన్ చొరవ తో ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. అని పల్ల బుచ్చయ్య మరియు ఎల్లాపూర్ రైతులు గ్రామస్తులు సీఎం కేసీఆర్ గారికి మరియు జిల్లా చైర్మన్ జగదీష్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కోయగూడా ఎల్లాపూర్ సర్పంచ్ గార రమేష్ ఉప సర్పంచ్ గార నగేష్, సెంటర్ నిర్వాహకురాలు రమాదేవి, రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: