మన్యం టీవీ : జూలూరుపాడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు లో ఈరోజు ఉదయం బిజెపి జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని )విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. కరొన వ్యాధి సోకి వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. రెమెడి స్ఫేవేర్ ధర మూడు వేల 400 కి ఇవ్వాల్సి ఉండగా 30,వేలు 40,వేల రూపాయలకు అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరారు. జూలూరుపాడు లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరొన టెస్ట్ లు ఎక్కువగా చేయాలని, టీకాలు కూడా రోజుకు ఎక్కువ మంది కి ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని, కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలి, అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కావలసినంత ఆక్సిజన్ , వెంటిలేటర్లు, టీకాలను అందించడానికి సిద్ధంగా ఉన్నది, కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు బియ్యం ఒక మనిషికి ఐదు కేజీలు చొప్పున రెండు నెలలు ఉచితంగా ఇస్తున్నది, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేసి పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి అని చెప్పి బిజెపి జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని)రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ ,బిజెపి మండల అధ్యక్షుడు సిరపురపు ప్రసాద్, భానోత్ సురేష్, నరహరి యాదవ్, లక్ష్మి అగర్వాల్, గోపాల్ రావు ,వందనపు సుబ్బు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: