మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో పంచాయతీ కార్యాలయం నందు ఈ రోజు కరోనా పై అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కరోనా కట్టడి పై వ్యాపారస్తులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా తహాసిల్దార్ సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు కరోనా పై అవగాహన కల్పించి నిర్ములనకు తగు చర్యలు తీసుకునే విధంగా చూడాలన్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో అశ్వాపురం ఎస్ఐ రాజేష్, సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, ఎంపిటిసి కమటం నరేష్, అంగన్వాడి టీచర్లు, ఆశ కార్యకర్తలు, హెల్త్ వర్కర్స్, వ్యాపారులు పాల్గొన్నారు
Post A Comment: