CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కి ఘనంగా నివాళులు అర్పించిన చండ్రుగొండ మండల కాంగ్రెస్ నాయకులు.

Share it:

 



చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :

మాజీ భారత ప్రధానమంత్రి, ఏఐసిసి అధ్యక్షులు భారతరత్న పొందిన స్వర్గీయ రాజీవ్ గాంధీ 30 వర్ధంతి సందర్భంగా  చండ్రుగొండ మండల వ్యాప్తంగా రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు. చండ్రుగొండ ప్రధాన సెంటర్ లో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో.. జెడ్పీటీసీ కొడకండ్ల వెంకటరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు షాబీరు హుస్సేన్,  రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పేదవారికి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ భారతదేశాన్ని ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాల కోసం ఎనలేని కృషి చేశారని. అలాంటి పథకాలను ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తూ అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని. ముఖ్యంగా ప్రభుత్వానికి అనుసంధానమైన కొన్ని ముఖ్యమైన సంస్థలను కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ దేశ ప్రజలను దోచుకు తింటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి యువత రాజీవ్ గాంధీ ఆశయాలను వారి సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లిన్నప్పుడే మనం రాజీవ్ గాంధీ కి ఇచ్చే అసలైన నివాళులు అని అన్నారు. ఈ కార్యక్రమంలో.. సర్పంచ్ పద్దం వినోద్, మండల నాయకులు నల్లమోతు రమణ, చుండ్రు విజయ్, కేశబోయిన నర్సింహారావు, వాసం శ్రీను, బడుగు శంకర్, బొర్రా సురేష్, ఇస్లావత్ రుక్మిణీ, గోవింద్ రెడ్డి, సోమనపల్లి ఫకీర్, బడుగు వెంకటేశ్, ఐఎన్ టియుసి నాయకులు మదర్ సాహెబ్, రవి,  తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: