గుండాల ఎం పి టి సి ఎస్ కె సంధాని
గుండాల మే 21 (మన్యం టీవీ) గుండాల ప్రభుత్వ వైద్యశాలకు ఇంచార్జ్ డాక్టర్ ను నియమించాలని గుండాల ఎంపీటీసీ ఎస్ కె సంధాని విజ్ఞప్తి చేశారు .వైద్యశాలలో పనిచేస్తున్న డాక్టర్ తో పాటు సిబ్బంది కరోనా బారిన పడిన రని వైద్య సేవలకు ఇబ్బందులు తలెత్తుతున్న తరుణంలో మెరుగైన వైద్యం అందాలంటే వైద్యుని నియమించాలన్నారు. ఏజెన్సీ గ్రామాల్లో రోజురోజుకు కరోనా బారిన ప్రజలు ఎక్కువగా పడుతున్నారు. ప్రస్తుత సిబ్బంది మెరుగైన వైద్యం అందిస్తున్నారు గాని వారు కూడా కరోనా బారిన పడటంతో సేవలకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. ఉన్నతాధికారులు స్పందించి మారుమూల ఏజెన్సీ మండలమైన గుండాలకు తక్షణమే వైద్యుని నియమించాలని విజ్ఞప్తి చేశారు
Post A Comment: