కరోనా బాధిత 20 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన జడ్పీటిసి
మన్యం టీవీ, అశ్వాపురం:కరోనా బాధితులకు జడ్పీటీసీ అండగా నిలిచారు. అశ్వాపురం మండలం ఆనందాపురం గ్రామంలో కరోనా బాధితులు 20 కుటుంబాలకు జడ్పీటీసీ సూది రెడ్డి సులక్షణ- గోపాలకృష్ణారెడ్డి దంపతులు తమ స్వంత ఖర్చులతో శుక్రవారం నిత్యావసర వస్తువులు ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు లక్ష్మణరావు, కడారీ శ్రీను, టీ ఆర్ ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కాక సర్వేశ్, నాయకులు లంకమల్ల కొండలరావు, ముత్యాల నర్సింహారావు, కట్రాజు నరేష్, కటకం వినోద్, చెన్నంసెట్టి సాంబ, కనితం నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: