మన్యంటీవీ,దమ్మపేట:
కుటుంబ కలహాలతో బావిలో దూకి వ్వక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం, బంజారా కాలనీలో చోటు చేసుకుంది. దమ్మపేట మండలం బంజారా కాలనీకి చెందిన ధర్మసోత్ మల్లేష్ రావు, రుక్మిణి దంపతులకు ఒక కుమారుడు, ఒక కూతురు కుమారుడు సుధాకర్ (21) కుటుంబ కలహాల నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయి తమ ఇంటి పక్కనే ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవటంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు మృతి చెందిన సుధాకర్ కి వివాహం జరిగి సంవత్సరం కూడా నిండలేదు మృతి చెందిన ప్రదేశం దగ్గరే డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించారు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Post A Comment: