CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కోవిడ్ నిబంధనలు తుంగలో తొక్కి

Share it:

 


నిత్యావసరాలు పంపిణీ

కార్మికుల సహయార్థం పంపిన నిత్యవసరాలలో రాజకీయం


గుంపులు గుంపులుగా జనసందోహం


మన్యం టీవీ మంగపేట.


 మంగపేట మండలం కమలాపురం గ్రామంలో బిల్ట్ కార్మికులకు నిత్యావసర వస్తువులను ఏ. యం.ఆర్ తాడి చర్ల కంపెనీ వారు జిల్లా కలెక్టర్ మరియు ఐ టి డి ఏ పి ఓ చేతుల మీద కొంత మంది కార్మికులకు పంపిణీ చేసి మిగతా సుమారు రెండు వందల కిట్లను కార్మికుల కోసం వారు కమలాపురం పంపించారు.అధికార తెరాస పార్టీ అనుబంధ యూనియన్ ఆఫీస్ లో పెట్టి కరోన నిబంధనలు తుంగలోతొక్కి విచ్చలవిడిగా భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా కార్మికులకు పంపిణీ చేస్తున్నారు. స్థానిక ఎమ్మెర్వో చెప్పిన వినకుండా కిట్లను పంపిణీ చేశారు.ఈ కిట్లను అధికార టిఆర్ఎస్ పార్టీ నాయకులు వారి పార్టీ కార్యాలయంలో పెట్టుకోని కరోనా నిబంధనలను పాటించకుండా పంపిణీ చేస్తున్నారని, అలా చేయడం వలన కరోనా వ్యాపించే అవకాశం లేకపోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించాలని కోరుతున్నారు.స్థానిక ఇతర పార్టీ నాయకులు ఇదేమిటని ప్రశ్నించగా మేము మా పార్టీ కార్యాలయంలో పంచుతాం మీరు ఏమి చేస్తారు అని ఇతర పార్టీ నేతల మీద మాటల యుద్ధానికి దిగారు.మంగపేట ఎస్.ఐ కి సమాచారం అందించగా ఎస్.ఐ వచ్చి అక్కడ ఉన్న కార్మికులను పంపించి ఆ కిట్ల పంపిణీ నిలుపుదల చేశారు.కార్మికులకు పంపిన నిత్యావసర కిట్లను పార్టీ ఆఫీసులో పెట్టి పంచడం ఏంటి అని స్థానికులు బాహాటంగానే విమర్శిస్తున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: