CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇంటింటి సర్వే గురించి మండల స్థాయి సమీక్ష సమావేశం

Share it:


మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో-జి రేవతి అధ్యక్షతన,మండలంలోని ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిణి- ప్రియాంక పర్యవేక్షణలో మండల సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ మూడవ దశ ఇంటింటి సర్వే త్వరగా పూర్తి చేయించాలని, కోవిడ్-19 లక్షణాలు ఉన్నవారికి వెంటనే కోవిడ్ కిట్టు అందించాలని, జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి కు పంపించేందుకు, మండల వ్యాప్తంగా కరోనా బాధితుల జాబితాను త్వరగా సిద్ధం చేయాలని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉంటూ, కోవిడ్ మరియు లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బయటకు వచ్చే విధంగా అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి-పోలెబోయిన కృష్ణయ్య , మండల అధికారులు, పంచాయతీ అధికారులు, ఎన్ఆర్ఈజీఎస్ అధికారులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: