చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి.
తన భర్త వాసం శ్రీనివాసరావు, పై గ్రామానికి చెందిన కొంతమంది దాడి చేశారని గురువారం గానుగపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ వాసం లలితా శివ జ్యోతి చండ్రుగొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గానుగపాడు గ్రామంలో ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమించుకొని ప్లాట్లు చేసి అమ్ముతున్నారని అట్టి భూములను కాపాడాలని గతంలో తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశాము. దీనిని దృష్టిలో పెట్టుకొని. ఉదయం నా భర్తతో కలిసి పంచాయతీ విధులకు వెళ్తున్న సమయంలో నాపై నా భర్తపై దాడి చేశారని ఇదే విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు.ఈ దాడి పై జడ్పీటీసీ కోణకండ్ల వెంకటరెడ్డి ఖండించారు. నిందుతులను అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేశారు. ఇదే విషయంపై ఎస్ఐ రాజేష్ కుమార్ ను వివరణ కోరగా. తమకు ఫిర్యాదు అందిందని దీనిపై విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.
Post A Comment: