మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని సింగిరెడ్డి పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మద్దుల గూడెం గ్రామంలో హఠాత్తుగా వచ్చిన గాలివానకు కొర్సా ముత్తయ్య రేకుల ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నది. రోడ్లకు ఇరువైపుల ఉన్న చెట్లు రోడ్డుమీద విరిగి పడ్డాయి కొద్దిసేపు రాకపోకలు కూడా అంతరాయం కలిగింది చెట్లు కరెంటు తీగలక మీద పడి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ కొర్స లక్ష్మి రూపవతి సంబంధిత అధికారులకు తెలియజేసి పరిస్థితిని వివరించడం జరిగింది. రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో నిలువ నీడ లేకుండా పోయిందని, కొర్సా ముత్తయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంటిలోనే చాలా వస్తువులు గాలివాన ధాటికి ధ్వంసం అయ్యాయని తెలియజేశాడు.
Post A Comment: