మన్యం మనుగడ పినపాక:
మండల లోని సింగిరెడ్డి పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మద్దులగూడెం గ్రామంలో గురువారం సాయంత్రం వచ్చిన గాలివానకు కొర్స ముత్యాలు ఇంటి రేకులు మొత్తం పగిలిపోయిన కారణంగా వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా మల్లారం గ్రామానికి చెందిన సాయి వెంకట పెల్టిలైజర్ యజమాని రమణ రూ. వెయ్యి, 25 కేజీల బియ్యం, కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఆసు సాయిబాబు ఆ కుటుంబానికి నిత్యావసర సరుకులు కూరగాయలు సర్పంచ్ కొర్స లక్ష్మీ రూపవతి చేతుల మీదుగా అందజేశారు. మానవత్వం చాటుకున్న రమణ, సాయిబాబు లను సర్పంచ్ లక్ష్మి రూపవతి అభినందించారు
Post A Comment: