CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కోవిడ్ పరీక్షలు , వ్యాక్సినేషన్ పారదర్శకంగా నిర్వహించాలి -అడిషనల్ డియంహెచ్ఓ శ్రీనివాస్

Share it:

 



మన్యం మనుగడ, పినపాక:


కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా టెస్టులు వ్యాక్సినేషన్ పక్రియ ను పారదర్శకంగా నిర్వహించాలని అడిషనల్ డియంహెచ్ఓ  శ్రీనివాస్ అన్నారు. శనివారం పినపాక ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ టెస్టులు , వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , కరోనా కట్టడి కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ముఖ్యంగా ప్రభుత్వాసుపత్రుల్లో టెస్టులు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసిందని అన్నారు . కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే ప్రజలు దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో టెస్టులు చేయించుకోవాలని సూచించారు . ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనా కట్టడికి కృషిచేయాలని అన్నారు . ఈ కార్యక్రమంలో తిరుపతి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రసాద్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: