మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మణుగూరు జనరల్ మేనేజర్ జక్కం.రమేష్ కు కరోనా మరియు కార్మిక సమస్యలపై మెమోరాండం ఇవ్వడం జరిగింది.దేశ వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా.కళ్ల ముందే తోటి కార్మికులు, ఆప్తులు,మిత్రులు,బంధువులు చనిపోతుంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పనిచేస్తున్న సింగరేణి కార్మికుల కోసం కనీస కరోనా రక్షణ చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని అన్నారు. సింగరేణి లోనే అత్యధిక ఉత్పత్తిని సాధిస్తున్న మణుగూరు ఏరియా కార్మికుల కొరకు కరొనా రక్షణ చర్యలు చేపట్టి కార్మికుల్లో ఉన్న అసంతృప్తిని తొలగించాలని అన్నారు.
మెమోరాండం అంశాలు
1.సింగరేణి కార్మికులకు మరియు కాంట్రాక్ట్ కార్మికులకు డాక్టర్లు రికమండ్ చేయబడ్డ ఎన్ 95 మాస్కులను,క్వాలిటీ శానిటీజర్ ను ఇవ్వాలని అన్నారు.
2.పని వేళలు మార్చాలని. భోజన విరామ సమయంలో పనిచేసి వెళ్లి పోయేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
3.కన్వెన్షన్ వెహికిల్స్ పెంచి
రద్దీ లేకుండా చేయాలి.
4.క్యాంటీన్ వెస్ట్ షెల్టర్ డంపర్లు డోజర్లు వెహికిల్స్ తదితర ప్రదేశాల్లో శానిటేజేషన్ చేయాలి.
Post A Comment: