మన్యం టీవీ ఏటూరు నాగారం
తాడ్వాయి మండలంలోని గ్రామాల్లో లాక్ డౌన్ వల్ల కూలీ పనులు లేక తిండికి ఇబ్బంది పడుతున్న ఆదివాసి గుత్తి కోయ నిరుపేదలకు తాడ్వాయి పోలీసులు జీటీఎస్ ఎస్ ఎస్ స్వచ్ఛంద సంస్థ వారి సహకారంతో బియ్యం మరియు నిత్యావసర సరుకులను అందజేశారు. ముందుగా ములుగు ఏఎస్పీ సాయి చైతన్య చేతుల మీదుగా మండెలతోగు గొత్తికోయ గుంపు వారికి అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తరువాత మండలంలోని జలగలంచ, కామారం, కొండపర్తి, కాల్వపల్లి, బాసన్నగూడ, వెంగళాపూర్,గోనెపల్లి,ఎలుబా క, గొత్తికోయ గుంపులా ప్రజలకు మరియు కాల్వపల్లి, తాడ్వాయి గ్రామాల్లోని నిరుపేదలకు బియ్యం మరియు నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను అందజేశారు.ఈ సందర్భంగా ములుగు ఏఎస్పీ సాయిచైతన్య మాట్లాడుతూ లాక్ డౌన్ లో నిరుపేదలు తిండికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో వారికి ఆసరాగా జీటీఎస్ ఎస్ ఎస్ స్వచ్ఛంద సంస్థ వారి సహకారంతో ఒక్కొక్కరికి పదికేజీల బియ్యం మరియు కేజీ ఉల్లిగడ్డ,కేజీ కందిపప్పు,కేజీ గోధుమపిండి, కేజీ చక్కెర,కేజీ ఉప్మా రవ్వతో కూడిన ₹2,50,000/- రూపాయల విలువచేసే 500ల కిట్లను అందజేయడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమానికి కృషి చేసిన పస్రా సీఐ శ్రీ అనుముల శ్రీనివాస్ ను, తాడ్వాయి ఎస్సై సీ.ఎచ్ వెంకటేశ్వరరావు ను మరియు తాడ్వాయి స్టేషన్ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైన జీటీఎస్ ఎస్ ఎస్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ మారినేని జాకబ్ ను, రొక్కటి వెంకటరామరావు ను, వారి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. బియ్యం మరియు నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను అందుకున్న పై గ్రామాల ప్రజలు పోలీస్ శాఖ వారికి మరియు జీటీఎస్ ఎస్ ఎస్ స్వచ్ఛంద సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేశారు.
Post A Comment: