CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనాతో ఎంపీడీవో గంటా వెంకట్రావు మృతి

Share it:


 మన్యం టీవీ, గుండాల:

👉ప్రజలతో  మమేకమై  విధులు  నిర్వహించేవాడు....

👉తక్కువ  సమయంలోనే   సమస్యల పరిష్కారం


 కరోనాతో గుండాల  ఎంపీడీవో  గంటా వెంకట్రావు మృతి చెందారు. గత కొద్దిరోజులుగా కరోనాతో బాధపడుతూ హైదరాబాదులోని ఒక ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ తుదిశ్వాసను విడిచారు .  తక్కువ సమయంలోనే  సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల ఆదరాభిమానాలను  పొందగలిగారు. ప్రజలతో   మమేకమై విధులను నిర్వహిస్తూ తనదైన శైలిలో దూసుకుపోయే వారు. తాను ఛార్జ్ తీసుకున్నప్పటి నుండి అభివృద్ధి  పనులలో ఎక్కడ అవకతవకలు లేకుండా సజావుగా సాగే విధంగా ఆయన వ్యవహరించేవారు. మరుగుదొడ్ల నిర్మాణంలో సైతం   తనదైన వ్యవహరిస్తూ  మండలంలో మరుగుదొడ్లు అన్ని పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్న ఎంపీడీవో  వెంకట్రావు  (50)మృతి ప్రజలతోపాటు అధికారులను సైతం   ఉలిక్కిపడేలా ఘటన  జరిగిందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా మొదటి దశ రెండో దశలోనూ  పంచాయతీ సర్పంచులు   కార్యదర్శులతో  నిరంతరం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ  కరోనా కట్టడి లో తన వంతు బాధ్యతను నిర్వహించారు.  పాత పంచాయతీల తో  పాటు నూతన పంచాయతీలో పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండేవారు. పంచాయతీల్లో డంపింగ్ యార్డ్ లను స్మశాన వాటిక లను సకాలంలో పూర్తయ్యేలా ఆయన చర్యలు తీసుకున్నారు 

Share it:

TELANGANA

Post A Comment: