బూర్గంపాడు పంచాయతీలో కిన్నెరసాని వాగు నుంచి మన ఇసుక వాహనం ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. కాగా ఈ "మన ఇసుక వాహనం" లో రోజు దాదాపు 60 ట్రాక్టర్లు ఇసుకను తరలిస్తున్నాయి.
ఈ 60 ట్రాక్టర్ల యజమానులు రోజు రెండు వందలు పంచాయతీకి కట్టాల్సిందే...! పంచాయతీ ఆధ్వర్యంలో రెండు వందలు
మామూలు వసూలు చేయడం బహిరంగ రహస్యం.కాగా ఇసుక బుకింగులు లేక...పడే ఒకటి, రెండు ట్రిపుల్ ల కోసం పంచాయతీకి రెండు వందలు, డ్రైవరుకు భోజనంతో ఆరు వందలు చెల్లిస్తే మాకు మిగిలేది ఏమిటని ట్రాక్టర్ యజమానులు బోరుమంటున్నారు. ఈ అక్రమ వసూళ్లపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.మన్యం టీవీ, భూర్గంపాడ్:
Post A Comment: