👉కరక గూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఊకె రామనాధం
మన్యం టీవీ ,కరకగూడెం:
కరక గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఇప్పటికే 50 పాజిటివ్ కరోనా కేసులు దాటినందున కరకగూడెం లో కఠినంగా లాక్డౌన్ అమలు చేయనున్నట్లు సర్పంచ్ ఊకె రామనాధం తెలిపారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులకు సూచనలు చేశారు.
1. మీ దుకాణాల ముందు ప్రజలు సామాజిక దూరం పాటించేలా 1 మీటరు దూరం బాక్స్ లు పెర్మనెంట్ మార్క్ లాగా తీసుకోవాలి.
2. ఆ బాక్స్ లలో క్యూ లైన్ పాటించేలా కస్టమర్స్ కు అలవాటు చేయండి.
3. మాస్క్ లేని కస్టమర్స్ కు మాస్క్ లేకుండా నిత్యావసరాలు, సరుకులు ఇవ్వడం కుదరదని వారిలో మార్పుకు మీరు మీ శాయశక్తులా ప్రయత్నించి, కరోనా నుండి మిమ్మల్ని మీరు రక్షించుకునే సంకల్పం తీసుకోండి.
4. ఎవరైనా మీ షాప్ దగ్గర కూరగాయల, వస్తువుల కొనుగోలుకు వచ్చి జలుబు, దగ్గు తో కనిపించినా మీరు మాకు సమాచారం ఇవ్వండి.
దుఖాన దారులపై ప్రతి రోజూ నిఘా ఉంచి ఇక నుండిఈ నియమాలను పాటించని వారిపై పంచాయతీ అపరాధ రుసుం(Fines) వేయబడునని తెలిపారు.
Post A Comment: