వరంగల్ : లాక్ డౌన్ వేళ మండుటెండలో రోడ్డుపై నడుస్తూ వెళ్ళుతున్న గర్భవతిని రైల్వే స్టేషన్ కు చేర్చిన సుబేదారి ఇన్స్ స్పెక్టర్ రాఘవేందర్.
వివరాల్లోకేళితే సికింద్రాబాద్ బోయినపల్లిలో నివాసం వుంటున్న వెంగళ అఖిల గర్భవతి కావడంతో తన భర్త అయిన రమేశ్ తో కల్సి హన్మకొండలోని తన తల్లి ఇంటికి వచ్చింది. అఖిల గర్భవతి కావడంతో స్థానిక హన్మకొండ లోని లక్ష్మీ నర్సింగ్ హోం లో పరీక్షలు నిర్వహించుకోని తిరిగి కాజీపేట రైల్వే స్టేషన్ కు వెళ్ళేందుకు ఎలాంటి వాహనం అందుబాటులో లేకపోవటంతో అఖిల తన భర్త తో కల్సి మండుటేండలో కాలినడకన వెళ్ళుతున్న సమయంలో జిల్లాపరిషత్ ప్రాంతంలో పెట్రోలింగ్ లో ఉన్న సుబేదారి ఇన్స్ స్పేక్టర్ కాలినడక వెళ్ళుతున్న అఖిలను గమనించిన తక్షణమే అఖిల ఆమె భర్తను తన పోలీస్ వాహనంలో కాజీపేట్ రైల్వే స్టేషన్ లో దింపడంతో దంపతులు ఇద్దరు పోలీస్ ఇన్స్ స్పేక్టర్ అందించిన సాయానికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు.
Post A Comment: