పంచాయతీ సిబ్బంది కోసం పీపీఈ కిట్లు అందజేత
మన్యం టీవీ, అశ్వరావుపేట: మేఘ ఇంజనీరింగ్& ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ యస్ఆర్ (మేఘ ఇంజనీర్ &బీహార్ ప్రాజెక్ట్ ఇంచార్జ్) విధులు నిర్వహిస్తున్న కొనకళ్ల సత్యనారాయణ సామాజిక స్పహను నిరూపించుకున్నాడు. కరోనా విజృంభన అధికమవుతున్న నేపథ్యంలో మండల పరిధిలోని తిరుమలకుంట గ్రామ పంచాయతీలో పని చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది కోసం తిరుమలకుంట గ్రామ ఉపసర్పంచ్ జూజ్జురి రాంబాబు కు పీపిఈ కిట్లు కొనకళ్ల సత్యనారాయణ అందజేసి గ్రామం పట్ల తన బాధ్యతను నిరూపించుకున్నాడు. అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామానికి చెందిన కొనకళ్ల సత్యనారాయణ మేఘ ఇంజనీర్ &బీహార్ ప్రాజెక్ట్ ఇంచార్జగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో తిరుమలకుంట గ్రామ పరిధిలో కరోనా వ్యాప్తి తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో సామాజిక బాధ్యతగా తనవంతు సాయం అందించాలని భావించాడు. ఈ క్రమంలో గ్రామ పంచాయతీలో విధులు నిర్వర్తిస్తున్న పంచాయతీ సిబ్బందికి కరోనా రక్షణ పరికరాలైన పిపిఈ కిట్లను ఉచితంగా అందజేసి సొంత ఊరి పరిరక్షణలో తన బాధ్యతను చాటుకున్నాడు, తమవంతు బాధ్యతగా చిరు సహాయం అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పల్లెల రామలక్మయ్య, బొల్లుకొండ చెన్నరావు, జగన్నాధం పాల్గొన్నారు.
Post A Comment: