మన్యం టీవీ, అశ్వాపురం:ఈ రోజు మొండికుంట గ్రామ పంచాయతీ కార్యాలయం లో మండల కోవిడ్ కమిటీ సభ్యులు అయినా అశ్వాపురం సి ఐ సట్ల రాజు, తహసీల్దార్ సురేషకుమార్ , వైద్యధికారి మణికంటారెడ్డి , ఎం పీ ఓ శ్రీనివాస్ , పాల్గొని ఏఎన్ఎం లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మల్టీ పర్పస్ ఉద్యోగులు కు కరోనా వైరస్ నివారణకు చర్యలపై అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేసి మొండికుంట లో విజ్రూంబిస్తున్న కరోనా ను కట్టడి చేయటానికి ఎలాంటి చర్యలకు అయిన యేనాకడొద్దని తెలిపారు. ఒక ఇంట్లో ఒక పాజిటివ్ కేసు వస్తే ఆ కుటుంబం మొత్తం కూడా ఇంట్లోనే ఉండాలని తెలిపారు. అవసరం అయితే నిబంధనలు అతిక్రమించిన వారిపై కోవిడ్ చట్టం ఉపయోగించి కేసులు నమోదు చేయాలనీ తెలిపారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, ఉప సర్పంచ్ సుదీర్, ఎంపీటీసీ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: