మన్యం టీవీ మంగపేట.
ముదిగొండ మండలం రాఘవాపురానికి చెందిన సాధినేని నాగమణి (50) కోవిడ్ తో పోరాడి ఈ నెల 26 న మరణించిన సందర్బంగా ఆశా కార్యకర్తగా ఆవిడ చేసిన సేవలు పురస్కరించుకొని సి. ఐ. టి. యూ ఆధ్వర్యంలో మంగపేట మండల కేంద్రం లో ఆశ కార్యకర్తలు సాధినేని నాగమణికి సంతాపంగా కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ సందర్బంగా సి.ఐ. టి. యూ. గౌరవ అధ్యక్షులు ఎల్పీ ముత్యాలు మాట్లాడుతూ కరోనాకు ప్రాణాలు ఎదురొడ్డి పోరాడుతున్న ఆశా కార్యకర్తల సేవలను ప్రభుత్వం గుర్తించి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వఉద్యోగులకు ఇచ్చే అన్ని అలవెన్స్లను ఇవ్వాలని, వేతనాలను పెంచాలని ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమం లో సి ఐ టి యూ గౌరవ అధ్యక్షులు ఎల్పీ ముత్యాలు,ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: