మన్యం టీవీ :ఇల్లందు
ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజక వర్గం పరిధిలోని కామేపల్లి మండలంలో ఆదివారం ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్, ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భానోత్ హరిసింగ్ నాయక్ దంపతులు కామేపల్లి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అంతోటి అచ్చయ్య ఆధ్వర్యంలో కామేపల్లి మండలం లోని వివిధ గ్రామాలు కొమ్మినేనిపల్లి, రూక్కతండ, రాయిగూడెం, పొన్నెకల్లు, బర్గగూడెం, గరిడేపల్లి, కొత్త లింగాల వివిధ గ్రామాలలో బైక్ పై ఎమ్మెల్యే దంపతులు లు పర్యటించి కరోనా బాధితులను పరామర్శించి వారితో..మాట్లాడి పండ్లు, కూరగాయలు, గుడ్లు సరుకులు పంపిణీ చేశారు. అలాగే సీరియస్ గా ఉన్న కోవిడ్ బాధితులను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో జాయిన్ చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పుచ్చకాయల సత్యనారాయణ, పిఏసిఎస్ చైర్మన్ దాని ఆకుల హనుమంతు రావు, ఎంపీటీసీ సునీత, లక్ష్మీనారాయణ, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వడియాల కృష్ణారెడ్డి, సురేష్ స్థానిక సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: