మన్యం టీవీ మంగపేట.
రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ది చెందిన ములుగు జిల్లా మంగపేట మండలం శ్రీ హేమాచల క్షేత్రంలో( మల్లూరు గుట్ట) నెలకొని ఉన్న శ్రీలక్ష్మీ నృసింహ స్వామి తిరు కళ్యాణం బుధవారం మధ్యాహ్నాం వైభవంగా జరిగింది. ఆలయ ఈఓ సత్యనారాయణ పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాల నిర్వాహక పూజారులు, భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ అర్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యులు, వారి బృందం ఆలయ అర్చకులు కైంకర్యం రాఘవాచార్యులు, ముక్కామల రాజశేఖర శర్మ, కారంపూడి పవనకుమారాచార్యులు తదితరుల ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కళ్యాణ మండపంలో మధ్యాహ్నాం అభిజిత్ లగ్నంలో ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లతో శ్రీ లక్ష్మీనృసింహస్వామికి పాణిగ్రహణం (జీలకర్ర బెల్లం) కార్యక్రమం నిర్వహించారు. మాంగల్య ధారణ కార్యక్రమం అనంతరం ముత్యాలతో తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. లాక్ డౌన్ నేపధ్యంలో స్వామి వారి కళ్యాణంకు భక్తులు ఎవరూ రావద్దని ఆలయ ఈఓ సత్యనారాయణ పత్రికా ప్రకటనల ద్వారా తెలియచేయడంతో స్వామి వారి కళ్యాణంకు భక్తులు రాలేదు.
Post A Comment: