CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వికసించిన మే పుష్పం

Share it:

 


మన్యం టీవీ, పినపాక:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపినపాక మండలంలో మే పుష్పం వికసించింది. వివరాలు ఇలా ఉన్నాయి. పినపాక మండలం మల్లారం గ్రామానికి చెందిన ప్రముఖ మద్యం వ్యాపారి వట్టి తిరుపతి రెడ్డి(వీటిఆర్)ఇంటి ఆవరణలో నాటిన మొక్కకు మే పుష్పం వికసించింది.పుట్ బాల్ లిల్లీ లేదా బ్లడ్ లిల్లీ చూడ్డానికి ఎర్రని బంతిలా, ఆకట్టుకొనేలా ఉంటుంది. దినినే స్థానికంగా భారతదేశంలో మే పుష్పం అంటారు. ఎండలు విపరీతంగా ఉన్నప్పుడు అంటే ఏప్రిల్, మే నెలల్లో పూస్తుంది కనుకనే దీనిని మే పువ్వు అంటారు.

ఇది లిల్లీ జాతికి చెందిన దుంప రకం మొక్క. ఒక్క సారి నేలలో పాతితే అది చనిపోవడం అంటూ ఉండదు. నెమ్మదిగా పిలకలు వేస్తూ విస్తరిస్తూనే ఉంటుంది. ఎంత వేడిగా ఉంటే అంతగా ఇది పూలతో వికసిస్తుంది.

మొగ్గ పువ్వుగా విచ్చుకోవడానికి సుమారు ఇరవై రోజులు పడుతుంది. ఒకటిన్నర నుంచి రెండడుగుల ఎత్తు ఉండే ఈ మొక్క తక్కిన కాలం అంతా పచ్చని వెడల్పాటి ఆకులతో అలరిస్తుంది.

మన్యం టీవీ విలేకరి, పినపాక.

దొడ్డి శ్రీనివాస్

Share it:

TELANGANA

Post A Comment: