ఆర్థికంగా లేకపోయినా అడిగిమరీ అవసరాలు తీరుస్తున్న అన్నదమ్ములు
మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని పినపాక గ్రామానికి చెందిన అన్నదమ్ములు తోకల సాంబయ్య ,చిట్టి లు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు. వచ్చిన కొద్ది సంపాదన తోనేవారి కుటుంబాలను పోషిస్తున్నారు.పినపాక పంచాయతీలో ఇటీవల కరోనా కేసులు అధికంగా రావడంతో కరోనా సోకిన కుటుంబాలు ఆర్థికంగా లేకపోవడం వలన,రోజు వారి జీవనానికి ఆటంకం ఏర్పడి బాధలు పడుతున్న స్థితిని గమనించిన అన్నదమ్ములు వారి కోసం ఏదైనా సహాయం చేద్దాం అనుకున్నారు. వారికి ఆర్థికంగా స్థోమత లేకపోవడం వలన గ్రామంలోని ఆర్థికంగా నిలదొక్కుకున్న వారి దగ్గరకు వెళ్లి,గ్రామంలోని కరోనా రోగుల పరిస్థితిని వివరించి వారి వద్ద నుండి , కరోనా రోగుల అవసరాల నిమిత్తం ఉపయోగపడే నిత్యావసరాలను పొంది, వాటిని అన్నదమ్ములు ఇద్దరు కలిసి గ్రామంలోని కరోనా రోగులకు పంచిపెడుతూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆర్థికంగా ఉండి ఆపదలో ఉన్నవారికి సహాయం చేయని ఈ రోజులలో, దయ గల దాతల దగ్గరకు వెళ్లి యాచించి మరీ, కరోనా రోగులకు వారి సహాయాన్ని నిస్వార్ధంగా అందిస్తున్న ఈ సోదరులను పినపాక మండల ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు చింతపంటి సత్యం, పంచాయతీ సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు గ్రామంలోని ప్రజలు మనస్ఫూర్తిగా వారికి అభినందనలను తెలియజేశారు
Post A Comment: