CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలి

Share it:

 


 న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం


 గుండాల ( మన్యం టీవీ) రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని న్యూ డెమోక్రసీ అనుబంధ సంఘాలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. (ఏఐకే ఎంఎస్) (పీ వై ఎల్) ఆధ్వర్యంలో దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాన్ని నిర్వహించారు . అనంతరం న్యూ డెమోక్రసీ నాయకులు నరేష్, పీ వై ఎల్ జిల్లా కార్యదర్శి రవి లు బుధవారం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మన్నారు. తక్షణమే వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆరు నెలల నుండి రైతులు పోరాటం చేస్తున్న మోడీ ప్రభుత్వం కనికరించడం లేదన్నారు. రైతే రాజు అని ప్రభుత్వాలు మాటలు చెబుతున్నాయి తప్ప ఏ ప్రభుత్వం రైతులను ఆదుకోవటం లేదన్నారు. రైతులను అప్పుల ఊబిలో కోరుకునే విధంగా ప్రభుత్వాలే వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. రైతులు ఆత్మహత్యలకు కారణమని అన్నారు. రైతాంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వై వెంకన్న ,గడ్డం లాలయ్య ,ఈ సం కృష్ణ ,సనప కృష్ణ ,బానోత్ లాలూ ,అట్టి కం శేఖర్ ,అజ్గర్ తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: