👉కరోన వైద్యం పేరుతో ప్రైవేట్ హాస్పిటటల్స్ లలో దోపిడీ. మన్యం టివి,ములకలపల్లి మండలం: మండలంలోని మాదారం గ్రామములో ములకలపల్లి జెడ్పిటిసి సున్నం నాగమణి తన నివాసంలో మాట్లడుతూ కరోనా సెకండ్ వేవ్ కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విపలమైయ్యాయని అన్నారు. కరోనా వైద్యం పేరుతో ప్రవేట్ హాస్పిటల్స్లో ఇష్టం వచ్చినట్లు ప్రజలను దోచుకుంటున్నారని అయిన పట్టించుకునేవారెలేరని, కరోనా మొదటి డోస్ దేవుడెరుగు, రెండవ డోస్ కూడ దొరకడం లేదని.రెండవ డోస్ ఇవ్వకుండా, ఆపడం చాల దారుణం అని . కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకూ పెరుగుతుంటే, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కరోనా టెస్టింగ్ కిట్స్ అందుబాటులో లేక ప్రజలు చాల ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు .కరోనా టెస్టింగ్ కిట్స్ తో పాటు ,మండలంలో ప్రతీ పంచాయతీ లో మొబైల్ కరోనా టెస్టులు ఏర్పాటు చేసి, అధిక మొత్తంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు టెస్టులు చెయ్యాలని, ఈ సందర్భం గా వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండు చేసారు.
Post A Comment: