CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

స్వచ్ఛంద మినీ లాక్ డౌన్ దిశగా బూర్గంపాడు మండలం

Share it:

 



మన్యం టీవీ,బూర్గంపాడు:


దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శనివారం బూర్గంపాడు మండల పరిషత్ కార్యాలయంలో మరియు సారపాక మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కరోనా కేసులు కట్టడి చేసే అంశంపై అఖిలపక్షం సమావేశం జరిగింది.ఈ అఖిలపక్షం సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు,నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొని,వారి సలహాలు సూచనలు మేరకు ఈ నెల 10వ తేదీ నుంచి రెండు వారాలు పాటు స్వచ్ఛంద లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు.ఈ స్వచ్ఛంద లాక్ డౌన్ కాలంలో ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే కిరాణా, కూరగాయలు, హోటళ్లు,మాంసం దుకాణాలు, మద్యం దుకాణాలు,శాలూన్ షాపులు తెరవాలని, అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉంటుందని

ఈ అఖిలపక్షం సమావేశంలో నిర్ణయించారు.ఈ అఖిలపక్షం సమావేశంలో బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, ఎమ్మార్వో బి.భగవాన్ రెడ్డి, ఎంపీడీవో వివేక్ రావు,మెడికల్ ఆఫీసర్ డా.స్పందన,బూర్గంపాడు 

ఎస్ ఐ జితేందర్,మండల టిఆర్ఎస్ అధ్యక్షులు గొపిరెడ్డి రమణ రెడ్డి,మండల టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,మండల సర్పంచ్లు, పంచాయతీ సెక్రటరీలు,వివిధ శాఖల అధికారులు,అఖిలపక్షం నాయకులు,వర్తక సంఘం వ్యాపారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: