CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉రేమిడిసివిర్ ఇంజక్షన్ ఎం ఆర్ పి ధరకే విక్రయించాలి.

Share it:


👉అధిక ధరకు విక్రయిస్తే వ్యాధి నియంత్రణ చట్టం ప్రకారం  కఠిన చర్యలు.

👉భద్రాద్రి జిల్లా కలెక్టర్ డా యంవి రెడ్డి.

మన్య మీడియా కొత్తగూడెం:-

కరోనా వ్యాధికి అత్యవసర చికిత్సకు వినియోగించే రేమిడిసివిర్ ఇంజక్షన్ ఎం ఆర్ పి ధరకే విక్రయించాలని జిల్లా కలెక్టర్ డా యంవి రెడ్డి తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యాధి గ్రస్తుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అధిక ధరకు విక్రయిస్తే వ్యాధి నియంత్రణ చట్టం ప్రకారం  కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇంజక్షన్ యొక్క ధరలను ప్రతి ఆసుపత్రిలో ప్రజలు తెలుసుకునే  విదంగా  ప్రదర్షింప చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి మాత్రమే  ఇంజక్షన్ వినియోగించాలని, ఎట్టి పరిస్థితిల్లో బయటకు విక్రయించడానికి అనుమతి లేదని తెలిపారు. ఇంజక్షన్ ఇచ్చిన వ్యక్తి యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ తో పాటు అతని పూర్తి చిరునామాను రిజిస్టర్ లో నమోదు చేయాలని,  వినియోగించిన ఇంజక్షన్ వాయిల్స్ ఆసుపత్రిలో భద్రపరచాలని, అధికారులు మెడికల్ ఆడిట్ నిర్వహణలో వినియోగించిన వాయిల్స్ ఆడిట్ నిర్వహణలో  అధికారులకు చూపాలని చెప్పారు. 

మెడికల్ మాఫియా నియంత్రణకు అధికారులు  నిరంతర తనిఖీలు చేపట్టాలని చెప్పారు. కోవిడ్ చికిత్సలు చేయుటకు అనుమతించ బడిన ప్రైవేట్  ఆసుపత్రిలో సేవలు సరిగా లేకున్నా  అధిక ఫీజులు వసూలు చేస్తున్నా, రేమిడిసివిర్ ఇంజక్షన్ ఎం ఆర్ పి ధర కంటే అధికంగా విక్రయించినా ప్రజలు 

డిఎం & హెచ్ ఓ డా శిరీష 

( 9948530088), డిసిఎహ్ఎస్ డా  ముక్కంటేశ్వర రావు 9700931010,  ఔషధ నియంత్రణ అధికారి బాలకృష్ణ 9849634754 కు కానీ సహాయత కొరకు 24 గంటలు అందుబాటులో ఉండే విందంగా  కలెక్టరేట్, జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో  ఏర్పాటు చేసిన  కోవిడ్ కంట్రోల్ రూము  ఫోన్ నంబర్లు 08744-241950 కు కానీ, 08744-246655కి కానీ  ఫోన్  చేసి తెలియ  చేయాలని ఆయన చెప్పారు. 

వచ్చిన ఫోన్ కాల్స్ ఆధారంగా విచారణ నిర్వహించి తనకు సమగ్ర నివేదికలు అందచేయాలని కలెక్టర్ డా యంవి రెడ్డి సంబందిత అధికారులను అదేశించారు.

Share it:

TELANGANA

Post A Comment: