మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలంలో కరోనా వైరస్ బారిన పడిన బాధితులకు రేగా విష్ణు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో
తెలంగాణా ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సొంత ఖర్చులతో అందించిన నిత్యవసర సరుకుల కిట్ను
మల్లెలమడుగు, మొండికుంట రామచంద్రపురం, నెల్లిపాక బంజర, గ్రామ పంచాయితీలలో ఉన్నటువంటి కరోనా బాధితులకు నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్తినేని సుజాత, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు కోడి అమరేందర్, మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్కే ఖదీర్ టిఆర్ఎస్ నాయకులు సూదిరెడ్డి గోపిరెడ్డి, సర్పంచ్ లు మర్రి మల్లారెడ్డి, కోడి కృష్ణవేణి, గొర్రెముచ్చు వెంకటరమణ, కాకా అశోక్, ఎంపీటీసీలు కమటం నరేష్, గాదె జయ, ఉప సర్పంచ్ చావా విరరాఘవులు, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ఈసంపల్లి పున్నారావు, యువజన నాయకులు మందా హుస్సేన్, కడారి వేణు, మంగళగిరి రామకృష్ణ, మహేష్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: