మన్యం టీవీ మంగపేట.
మండల వ్యాప్తంగా యుద్ధప్రాతిపదికన ఇంటి ఇంటికి సర్వే మొదలయింది. ఈ సర్వేలో భాగంగా రాజుపేట గ్రామ పంచాయతీ పరిధిలో పంచాయతీ కార్యదర్శి రేగా రాజశేఖర్ ఆధ్వర్యంలోపంచాయతీ సిబ్బంది, అంగన్వాడీలు, ఏ యన్ యం, ఆశాలు, వి ఆర్ ఏ లు,ఇంటి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరూ తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతూ నలభై అయిదు సంవత్సరాలు దాటిన వారు రిజిస్ట్రేషన్ చేయించుకుని తప్పకుండ కోవిడ్ వాక్సిన్ తీసుకోవాలి అని సూచించారు. అవసరం అయితే తప్ప బయటకు రాకూడదని వస్తే భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ ధరించి, తరచూ సబ్బుతో లేదా శానిటైజర్ తో చేతులు శుబ్రపరచుకోవాలంటూ, జ్వరం, దగ్గు, వళ్ళు నొప్పులు లాంటి లక్షణాలు ఉంటే డాక్టర్స్ సలహాతో తగు మెడిసిన్ తీసుకొని జాగ్రత్తలు పాటించాలి,స్వీయ నియమ నిబంధనలు మనకు శ్రీరామ రక్ష అంటూ ప్రజలకు ఈ సందర్బంగా కార్యదర్శి తెలియజేసారు. ఇంటి ఇంటికి సర్వే కార్యక్రమం లో కార్యదర్శి రేగా రాజశేఖర్, అంగన్వాడీ టీచర్స్ విజయలక్ష్మి, మేరీకమల, ఏ ఎన్ యం అరుణ ఆశవర్కర్స్ పుణ్యవతి, విజయకుమారి,వి ఆర్ ఏ నాగరాజు, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: