CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు

Share it:

 





 మన్యంటీవీ,అశ్వారావుపేట:భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదుభార్యను హత్య చేసిన కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయమూర్తులు భర్తకు జీవిత ఖైదు విధించారు. ఈ విషయాన్ని స్థానిక సిఐ ఉపేందర్ రావు గురువారం విలేకరులకు తెలిపారు. అశ్వారావుపేట నియోజకవర్గం అశ్వారావుపేట మండలంలోని పేరాయిగూడెం పంచాయితీ డ్రైవర్స్ కాలనీకి చెందిన నాగబోయిన సుబ్బారావు తన భార్య సత్యశ్రీని 2015 నవంబర్ 10 నాడు హత్య చేసాడు. మృతురాలు తల్లి బండారి బేబి ఫిర్యాదు మేరకు నాడు విధుల్లో ఉన్న ఎస్ఐ కోండ్రు శ్రీను సిఆర్ నెంబర్ 176/2015, యుఎస్ 498 (ఎ), 302, 201 ఐపిసితో కేసు నమోదు చేయగా, సిఐ టి. రవికుమార్ విచారించి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసారు. సుదీర్ఘకాలం సాక్షులను విచారించిన సత్తుపల్లి 4 వ, అదనపు న్యాయమూర్తి సాయిభూపతి నేరం రుజువు కావడంతో నాగబోయిన సుబ్బారావుకి గురువారం జీవితం ఖైదు, రూ. 200 లు జరిమానా విధిస్తూ శిక్ష ఖరారు చేసారు. ఈ కేసులో ఎపిపి మహేంద్రనాథ్, కోర్టు కానిస్టేబుల్ వి. నరేష్ లు సహకరించారు.

Share it:

TELANGANA

Post A Comment: