CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనాతో.... కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పెండ్లి శ్రీనివాస్ రెడ్డి మృతి

Share it:

 



మన్యం టీవీ: ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లలితాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు మాజీ వైస్ ఎంపీపీ పెండ్లి శ్రీనివాస్ రెడ్డి (55) శుక్రవారం రాత్రి కరోనా తో మృతి చెందారు. ఆయనకు భార్య పిల్లలు ఉన్నారు. గతంలోనే షుగర్, బిపి, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. దీనికి తోడుగా కరోనా రావడంతో ఖమ్మం లోని వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత రెండు దశాబ్దాలుగా అనేక పదవులు అలంకరించి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కి కృషి చేశారు. ప్రజా ప్రతినిధిగా అనేక కార్యక్రమాల్లో పాల్గొని ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు చీమల వెంకటేశ్వర్లు, డాక్టర్ రవి నాయక్, మండల అధ్యక్షులు కార్యదర్శులు పులి సైదులు, డానియల్, గోల్కొండ సత్యనారాయణ ఆయన చేసిన సేవలను కొనియాడారు. కుటుంబాన్ని ఓదార్చి సంతాపం వ్యక్తం చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: