మన్యం టీవీ, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రసిద్ధి గాంచిన తుమ్మలచెరువు ఆయకట్టు కింద రైతులు చెమటోడ్చి సాగు చేసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలిస్తే దాన్యం కేంద్రంలో రైతు బాధలు అంతా ఇంతా కాదు శాతం వచ్చేవరకూ ధాన్యాన్ని ఆర పెడదామంటే రోజుకొకసారి వాతావరణ మార్పుల వల్ల ఎప్పుడు వర్షం వస్తుoదో తెలియని అయోమయ పరిస్తితి లో రైతన్న రైతాంగం పై వరుణ దేవుని గూడా కన్నెర్ర చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ అష్టకష్టాలు పడి ధాన్యాన్ని శాతం వచ్చేవరకు ఆరబెట్టిన తర్వాత కొనుగోలు కేంద్రంలో కాంటాల కోసం రోజుల తరబడి వేచివుండాల్సిన పరిస్థితి కాంటాలు అయిన తర్వాత కూడా మిల్లర్లకు తరలించాలంటే లారీలు రాని పరిస్థితి రోజుల తరబడి కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఉండాలంటే పట్టలకు(బరకాలకు)తూర్పాలకు శాతం కోసం ఆరబెట్టడం కోసం వేల రూపాయలు ఖర్చు అవుతుందని ఇక రైతులకు అన్ని ఖర్చులు పోను ఏం మిగులుతుందని రైతులు వాపోతున్నారు.ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాంటాలు వెంటనే జరిగేటట్టు చూడాలని కాంటాలు పెట్టిన ధాన్యాన్ని మిల్లర్లకు వెంటనే తరలించాలని రైతులు కోరుతున్నారు.
Navigation
Post A Comment: