రూ.18,02,088 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు
మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు మణుగూరు టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి పధకం ద్వారా పేద ఇంటి ఆడపిల్లల కు కానుకగా రూ.1,00,116 చెక్కును కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా పేదల సంక్షేమం అగకూడదు అని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కల్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరు ఐన కళ్యాణ లక్ష్మీ చెక్కులను మొత్తం 18 మంది లబ్ధిదారులకు రూ.18,02,088 రూపాయల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులు కు అందజేసిన మణుగూరు జడ్పీటీసీ పొశం. నర్సింహారావు,పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,టిఆర్ఎస్ నాయకులు ఎడ్ల.శ్రీను,హరి ప్రసాద్,వెంకటసోములు,తాత రమణ,గణేష్, కోటేశ్వరరావు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు,యువజన నాయకులు గుర్రం సృజన్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: