మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మున్సిపాలిటీ మాజీ ఎన్ ఎమ్ ఆర్ కార్మికుడు కొమరయ్య మృతి బాధాకరం అని తెలంగాణ ప్రగతి శీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐ.ఎఫ్.టి.యు అనుబంధం రాష్ట్ర నాయకులు బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు. మతిస్థిమితం కోల్పోయిన కొమురయ్య రెండు రోజుల క్రితం ఇంటి నుండి తప్పిపోయి అశ్వాపురం మండలం చింత్రియాల లో మరణించినట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్న ఆయన కొమురయ్య కుటుంబాన్ని పరామర్శించి,ఆయన మృతికి సంతాపం ప్రకటించి, ఆయన కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.కరోనా కష్ట కాలం కావున తమ వంతు సహాయంగా దహన సంస్కారాల నిమిత్తం 3 వేల రూపాయలను ఆయన కూతురు లత కి అందజేశారు.సంతాపం తెలిపిన వారిలో ఐ.ఎఫ్.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి, ఐ.ఎఫ్.టి.యు మణుగూరు ఏరియా నాయకులు ఆర్. సాంబిరెడ్డి,ఎండీ.గౌస్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: