గుండాల ( మన్యం టీవీ) రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలైన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. దామర తోగు గ్రామానికి చెందిన కుంజ సమ్మయ్య గుండాల నుండి వెళ్తున్న క్రమంలో బంకు వద్ద ట్రాక్టర్ ఢీ కొనడంతో కాలు విరిగినది. స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించడంతో వాహనం గుండాల ప్రాథమిక వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్సకోసం సమ్మయ్య ను ఖమ్మం తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ ను డ్రైవర్ ఆపకుండా వెళ్లడంతో ట్రాక్టర్ ఎవరిది అనేది తెలియాల్సి ఉంది
Post A Comment: